Thursday, March 20, 2014

సిపిఎం కూటమిని గెలిపించాలి...

                  ప్రాదేశిక సంస్థల ఎన్నికల్లో సిపిఎం కూటమిని అత్యంత మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు, మాజీ ఎంఎల్ఏ నోముల నర్సింహయ్య పేర్కొన్నారు. బుధవారం సిపిఎం ఎంపిటిసి అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. స్థానిక నార్కట్ పల్లి   మండలపరిషత్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపిఎం,సిపిఐ, టిఆర్ఎస్ పోటీచేస్తున్న స్థానాల్లో కాంగ్రెస్,టిడిపిలను మట్టికరిపించి జెడ్పీటీసి,ఎంపిపి గెలుచుకునే విధంగా అన్ని పార్టీల నాయకులు కృషిచేయాలని కోరారు. ఈయన వెంట ఆ పార్టీ మండల కార్యదర్శి ఎస్.ఆర్ వెంకటేశ్వర్లు, డివిజన్ కమిటీ సభ్యులు చెరుకు పెద్దులు, రజక సంఘం జిల్లా కార్యదర్శి దామెర వేణు, వెంకట్ రెడ్డి, కంఠమహేశ్వరం, కల్లూరి యాదగిరి, బత్తుల అనంతరెడ్డి ఉన్నారు. 
సిపిఎం నామినేషన్లు
               మండలంలోని 15 ఎంపిటిసి స్థానాలకు సిపిఎం 6 స్థానాల్లో పోటీచేస్తుంది. బుధవారం మండలపరిషత్ కార్యాలయంలో ఆ పార్టీ నుండి యల్లారెడ్డిగూడెం అభ్యర్థిగా కల్లూరి యాదమ్మ, నార్కట్ పల్లి 3 నుండి గాలి నర్సింహ, ఔరవాణి నుండి ముప్పిడి ఇస్తారి, చెరుకుపల్లి చంద్రయ్య,నెమ్మాని నుండి గాలి ప్రేమలత నామినేషన్లు దాఖలు చేశారు. అదే విధంగా చెరుకుపల్లి చంద్రయ్య ఔరవాణి నుండి దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కంఠమహేశ్వరం, కొప్పు శ్రవణ్ పాల్గొన్నారు.


No comments:

Post a Comment